Ayyagari Sambasiva Rao

అయ్యగారి సాంబశివరావుఎ.యస్.రావుగా ప్రసిద్ధుడైన అయ్యగారి సాంబశివరావు భారతదేశ అణు శాస్త్రవేత్త. హైదరాబాదులోని ఈ.సి.ఐ.ఎల్ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇండియా లిమిటెడ్) సంస్థ వ్యవస్థాపకుడు. మరియు పద్మ భూషణ్ పురస్కార గ్రహీత. ఈయన పేరు మీదుగానే హైదరాబాదులో ఈ.సి.ఐ.ఎల్ ఉద్యోగులు నివసించే కాలనీకి ఎ.యస్.రావు నగర్ గా నామకరణం చేశారు.ఎ.యస్.రావు సెప్టెంబర్ 20, 1914న పశ్చిమ గోదావరి జిల్లా మోగల్లులో జన్మించాడు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయము నుండి విజ్ఞానశాస్త్రములో మాస్టరు డిగ్రీ అందుకొని అక్కడే అధ్యాపకునిగా ఆరు సంవత్సరాల పాటు పరిశోధనలు చేశాడు. 1946లో సాంబశివరావు స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయములో ఎలక్ట్రికల్ ఇంజనీరింగులో మాస్టరు డిగ్రీ చేయటానికి ప్రతిష్ఠాత్మక టాటా స్కారలుషిప్పుతో ఎన్నికైనాడు. 1947లో స్టాన్‌ఫర్డ్ నుండి ఇంజనీరింగు పట్టాపుచ్చుకొని భారతదేశము తిరిగివచ్చిన తర్వాత భారతదేశ అణుశక్తి విభాగములో అణు శాస్త్రవేత్తగా చేరాడు. అక్కడ హోమీ బాబా వంటి ప్రముఖులతో కలసి పనిచేశాడు. ఈయన 2003, అక్టోబర్ 31న మరణించాడు.

పురస్కారాలు

* పద్మశ్రీ పురస్కారం, 1960

* శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారం, 1965

* గౌరవ డాక్టరేటు, ఆంధ్రా విశ్వవిద్యాలయం, 1969,

* పద్మ భూషణ్ పురస్కారం, 1972

* ఫెలో ఆఫ్ ఇండియన అకాడెమీ ఆఫ్ సైన్సెస్, 1974,

* ఫిక్కీ అవార్డ్ ఆఫ్ ఔట్‌స్టాండింగ్ అచీవ్‌మెంట్ ఇన్ ఇంజనీరింగ్, 1976,

* ఇన్సిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ (ఇండియా) వారి నేషనల్ డిజైన్ అవార్డు, 1977,

* ఆంధ్రప్రదేశ్ అకాడెమీ ఆఫ్ సైన్స్ యొక్క విశిష్ట శాస్త్రవేత్త అవార్డు 1988,

* డా.నాయుడమ్మ స్మారక బంగారు పతకం 1989.