Amartya Sen-అమర్త్యా సేన్

జననం ---- నవంబరు 3, 1933-శాంతినికేతన్,భారతదేశమునివాసం --- USAజాతీయత --- ‎ Indianరంగము --- అర్థశాస్త్రముసంస్థ ----- హర్వర్డ్ యూనివర్శిటీ(2004 - ),ట్రినిటీ కాలేజి, కేంబ్రిడ్జి(1998-2004),ఆక్సఫర్డ్ విశ్వవిద్యాలయము (1977-88),లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (1971-77),ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్(1963-71),Trinity College, Cambridge(1957-63).జాదవ్ పూర్ యూనివర్శిటీ(1956-58)మాతృ సంస్థ -- ట్రినిటీ కాలేజీ, కేంబ్రిడ్జి (పి.హెచ్.డి)(బి.యే.),ప్రెసిడెన్సీ కాలీజీ, కొలకత్తా (బి.యే.)ప్రాముఖ్యత--- Welfare Economics.,Human development theoryముఖ్య పురస్కారాలు----- నోబెల్ బహుమతి (1998), Bharat Ratna (1999)మతం---- హిందూఅమార్త్య కుమార్ సేన్ - భారతీయ తత్త్వ శాస్త్రవేత్త, ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి స్వీకరించిన తొలి భారతదేశపు ఆర్థిక శాస్త్రవేత్త. 1998లో కరువు, మానవ అభివృద్ది సిద్ధాంతము, సంక్షేమ ఆర్థిక శాస్త్రము, పేదరికమునకు కారణములు మరియు political liberalism లలో చేసిన విశేష కృషికి నోబెల్ బహుమతి లభించింది.సంక్షేమ రంగంలో విశేష కృషి చేసినందులకు అతనికి 1998లో ఈ ఉన్నతమైన బహుమతి లభించింది.

బాల్యం :

1933 నవంబర్ 3న బెంగాల్‌లోని శాంతినికేతన్లో జన్మించిన అమర్త్యా సేన్ 1941లో హైస్కూలు విద్య ఢాకాలో పూర్తిచేసుకొన్నాడు. 1947లో దేశవిభజన తర్వాత భారతదేశానికి తిరిగివచ్చి విశ్వభారతి, ప్రెసిడెన్సీ కళాశాలలలో అభ్యసించాడు. కేంబ్రిడ్జిలోని ట్రినిటి కళాశాలలో 1956 గ్రాడ్యుయేట్ పూర్తిచేసుకున్నాడు. 1959లో Ph.D. పట్టా పుచ్చుకున్నాడు.

కుటుంబము :

సేన్ మాతామహుడు క్షితిమోహన్ సేన్ మధ్య యుగము చరిత్రలో పండితుడు. అతను రవీంద్రనాథ్ టాగూర్ కు సన్నిహితుడు. సేన్ తల్లి అమితా సేన్, తండ్రి అశుతోష్ సేన్. తండ్రి ఢాకా విశ్వవిద్యాలయంలో రసాయనశాస్త్రము బోధించేవాడు. సేన్ మొదటి భార్య నవనీతదేవ్ సేన్, అరాధించబడిన రచయత, పండితురాలు. ఆమెతో సేన్ కూ ఇద్దరు పిల్లలున్నారు. అంతర సేన్, నందనా సేన్. ప్రస్తుతం అంతరా సేన్ పత్రికా విలేఖరి. తన భర్త ప్రతీక్ కంజీలాల్ తో కలిపి లిటిల్ మ్యాగజీన్ ను ప్రచురిస్తున్నారు. నందనా సేన్ బాలీవుడ్ నటీమణి. అమార్త్య నవనీత లు 1971 లో లండన్ కు వెళ్ళగానే భేదాలు వచ్చి విడాకులు పుచ్చుకున్నారు.

సేన్ రెండవ భార్య ఇవా కలోర్ని. వీరి కాపురము 1973 నుండి 1985 లో అమె జీర్ణ సంబంధమైన క్యాన్సర్ తో చనిపోయేంత వరకు నడిచింది.

సేన్ ప్రస్తుత భార్య ఎమ్మా జార్జీనా రోత్ షీల్డ్, ఒక ఆర్థిక చరిత్రకారురాలు. ఈమెతో ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇంద్రాణీ, కబీర్. ఇంద్రాణీ న్యూయార్క్ లో విలేఖరి. కబీర్ బోస్టన్ లో మ్యూజిక్ టీచరు.

అర్థశాస్త్ర ఉపన్యాసకుడిగా :

Ph.D. పూర్తికాగానే కోల్‌కత విశ్వవిద్యాలయంలోనూ, ఢిల్లీలోని జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయంలోనూ, ఆ తర్వాత ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలోనూ అర్థశాస్త్ర ఉపన్యాసకుడిగా పనిచేశాడు.

వివాహం-విడాకులు :

1960లో నవనీత దేవి అనే బెంగాలీ కవియిత్రిని వివాహం చేసుకున్నాడు. వారికి అంతర, నందన అనే పిల్లలు కూడ కల్గినారు. 1971లో వారు లండన్ వెళ్ళిన తర్వాత వివాహబంధం తెగిపోయింది. నవనీతకు విడాకులిచ్చి ఎవా కొలొర్నీ అనే పాశ్చాత్య మహిళను 1973 లో వివాహం చేసుకున్నాడు. వారికి ఇంద్రాణి, కబీర్ అనే ఇద్దరు పిల్లలు. 1985లో క్యాన్సర్ వ్యాధితో రెండో భార్య చనిపోయింది. అతని ప్రస్తుత భార్య కేంబ్రిడ్జి కింగ్స్ కళాశాలలో పని చేస్తున్న ఎమ్మా జార్జిన రూత్‌చైల్డ్స్.

అర్థశాస్త్రంలో సేన్ కృషి :

సంక్షేమం వైపు, పేదరికం, నిరుద్యోగం వైపు అమర్త్యా సేన్ కృషి అమోఘమైనది. సంక్షేమ అర్థశాస్త్రం వైపు దృష్టి సారించి ప్రజలకు కనీస అవసరాలు ఎలాగో ప్రజాస్వామిక హక్కులు కూడ అంతే ముఖ్యమని ఉద్ఘాటించాడు. ప్రపంచంలోని అన్ని దేశాలు తమతమ రక్షణ బడ్జెట్ ను తగ్గించాలని హితవు పల్కినాడు. పేదరిక స్థాయిని నిర్థారించడానికి అమర్త్యా సేన్ సోషల్ ఛాయిస్ అనే నూతన సూత్రీకరణను ప్రవేశపెట్టాడు. పేదరికానికి, కరువుకు ప్రధాన కారణం ఆహార ధాన్యాల కొరత కాదని, ఉపాధి లేకపోవడంతో ప్రజల వద్ద కొనుగోలు శక్తి లేకపోవడమే ప్రధాన కారణమని తన అధ్యయనాల ద్వారా నిరూపించాడు. ప్ర్రాథమిక విద్య, ఆరోగ్యం ఏ దేశ అభివృద్ధిలోనైనా కీలక పాత్ర వహిస్తాయని ఉద్ఘాటించాడు. నీతిశాస్త్రం, తత్వశాస్త్రాల వెలుగులో అభివృద్ధి అర్థశాస్త్రానికి కొత్త రూపం చేర్చాడు.1943 లో బెంగాల్ లో కరువు సంభవించినప్పుడు అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం నియమించిన ఎంక్వైరీ కమీషన్ సకాలంలో వర్షాలు లేకపోవడం, బర్మా నుండి ధాన్యం దిగుబటి కాకపోవడం వంటి కారణాలను చూపించగా, అమర్త్యాసేన్ దానికి పూర్తిగా విరుద్ధమైన కారణాలను అర్థశాస్త్ర పరంగా విశ్లేషించి సంక్షేమ అర్థశాస్త్రానికి కొత్త రూపం ఇచ్చాడు.

సేన్ బోధనల్లోవిశేషాలు :

* ప్రేమ పునాదిగా పంచబడే న్యాయం ఒడంబడిక ద్వారా పంచబడే న్యాయం కంటే విలువైనది

* అశోకుడు బుద్దిస్టు సూత్రాలపై ఏర్పరచిన రాజ్యంలో 'ప్రజాసంక్షేమం బలంగా అంతర్లీనమై ఉంటుంది

* అక్బర్‌ సెక్యులర్‌ న్యాయపునాదులు వేసిన రాజు సర్వమత సమానత్వ సూత్రీకరణను రూపొందించిన తాత్వికుడు.ఇటలీలో 1600 సంIIలో బ్రూనో ను మతవిశ్వాసాలను ధిక్కరిస్తూ హేతుబద్ద ఆలోచనలను ప్రకటించినందుకు సజీవంగా కాల్చి చంపుతున్న కాలంలోనే అక్బరు అద్భుత లౌకిక జాతీయవాదానికి పునాదులు వేసాడు

* భగవద్గీతలోని కృష్ణుని యుద్ద నీతి పాజిటివ్‌ న్యాయ సిద్ధాంతం. గాంధీ అహింసలోనే హింసావాదం దాగి ఉంది.

అవార్డులు :

* 1998 లో అత్యున్నతమైన నోబెల్ బహుమతి స్వీకరించాడు

* 1999 లో భారత ప్రభుత్వపు భారత రత్న అవార్డుకు ఎంపికైనాడు.

* 2000 లో లియోంటీప్ ప్రైజ్ పొందినాడు.

* 2000 లో అమెరికా దేశపు ఐసెన్ హోవర్ మెడల్ పొందినాడు.

రచనలు :

* 1999 లో Development as Freedom, 1999

* Choice of Techniques, 1960;

* Collective Choice and Social Welfare, 1970;

* On Economic Inequality, 1973;

* Poverty and Famines: an Essay on Entitlement and Deprivation, 1981;

* Hunger and Public Action, jointly edited with Jean Dreze, 1989;

* India: Economic Development and Social Opportunity, with Jean Dreze, 1995;

* Commodities and Capabilities, 1999

* Sen, Amartya, Collective Choice and Social Welfare, San Francisco, Holden-Day, 1970

* Sen, Amartya, On Economic Inequality, New York, Norton, 1973

* Sen, Amartya, Poverty and Famines : An Essay on Entitlements and Deprivation, Oxford, Clarendon Press, 1982

* Sen, Amartya, Choice, Welfare and Measurement, Oxford, Basil Blackwell, 1982

* Sen, Amartya, Food Economics and Entitlements, Helsinki, Wider Working Paper 1, 1986

* Sen, Amartya, On Ethics and Economics, Oxford, Basil Blackwell, 1987.

* Drèze, Jean and Sen, Amartya, Hunger and Public Action. Oxford: Clarendon Press. 1989.

* Sen, Amartya, More Than 100 Million Women Are Missing. New York Review of Books, 1990.

* Sen, Amartya, Inequality Reexamined, Oxford, Oxford University Press, 1992.

Source : వికీపీడియా నుండి