అధ్యాయం - 24

||సీ.|| నీపాద సేవను నిత్యమ్ముజేయుచూ

మావిశీబాయి అణ్ణాలు నాడు

కలహింప వృద్ధుల కయ్యంబు జూచుచూ

నవ్వంగ పడిపడి నచటివారు

సాయినాధుడు మరి శాంతచిత్తముతోడ

వృద్ధుల నగుబాటు సద్దుజేయ

తల్లిని ముద్దాడ తనయుని తప్పెట్లు

తల్లి బిడ్డల వావి ధరణియందు

||ఆ.వె.|| అతి పవిత్ర మగుట అభ్యంతరమదేల

అవని జనులకెల్ల అమ్మ వరము

అనుచు నావిధముగ నాశీర్వదించెను

సకల సుగుణ శీలి సాయిరామ ||41||


అధ్యాయం - 25