అధ్యాయం - 15

||సీ.|| చక్కర లేకుండ చోళ్కరు తేనీరు

సేవించి మిగులుతో షిర్డి యాత్ర

సేయ సంకల్పింప సాయినాధుడు మది

సంతసంబొంది దర్శనమునిచ్చి

చోళ్కరు మనసునుప్రకటింప మదినెంచి

విరివిగా చక్కరవేసినట్టి

తేనీరు నిమ్మని దెలిపి జోగుకపుడు

యాశ్చర్య పరచెను యందరెదుట


||ఆ.వె.|| పేదవారి గాచు పెన్నిధి మనసాయి

కరుణ గలిగినంత కలుగు సిరులు

వింతగాదు మీరు విన్నపములు సేయ

సకల సుగుణ శీలి సాయిరామ||27||


అధ్యాయం - 16,17