అధ్యాయం - 16,17

||సీ.||ధనికుడొకడు వచ్చి దర్శించి సాయినీ

పరగ బ్రహ్మ జ్ఞాన వరమునివ్వ

మనివేడి కూర్చుండ మాటమార్చిన సాయి

నందుమార్వడి వద్ద నైదు రూప్య

ములడిగి తెమ్మని బాలకునంపగా

రిక్త హస్తముల చేరెను యతండు

ధనికుడూరక జూచె తనకేమి పట్టక

సాయి చెప్పదొడంగె సభ్యులకును


||గీ.|| బుద్ధి యహమును మనమును ఇంద్రియములు

నైదును ప్రాణములునైదు నవిరళముగ

నర్పణము సేయ బ్రహ్మము నరయవచ్చు

సకల సద్గుణ ధామ ఓం సాయిరామ ||28||


అధ్యాయం - 18,19